ఇండియా మరియు న్యూజిలాండ్ ల మధ్యన ముగిసిన వన్ డే సిరీస్ ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్ ఆసాంతం ఇండియా ఆటగాళ్లు కివీస్ కు బొమ్మ చూపించారు. ముఖ్యంగా గిల్, కోహ్లీ, రోహిత్ శర్మలు సెంచరీలతో సత్తా చాటగా, బౌలింగ్ లో సిరాజ్, షమీ , శార్దూల్ ఠాకూర్ మరియు కుల్దీప్ యాదవ్ లు రాణించి సిరీస్ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇండియా ప్రదర్శన ముందు కనీసం పోటీ ఇవ్వలేక చతికిలపడ్డారు, ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు అయిన విలియమ్సన్ , బౌల్ట్ మరియు సౌథీ లు లేని లోటు క్లియర్ గా తెలిసిందే. కానీ ఈ సిరీస్ ద్వారా కివీస్ కు ఒక మంచి క్వాలిటీ బ్యాట్సమన్ దొరకడం సానుకూలాంశం.

కాగా రేపటి నుండి మూడు టీ 20 ల సిరీస్ మొదలు కానుంది. రేపు సాయంత్రం సరిగ్గా 7 గంటలకు జార్ఖండ్ లోని రాంచి వేదికగా మొదటి టీ 20 స్టార్ట్ కానుంది. ఈ సిరీస్ కు సీనియర్ లు అయిన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లిలకు టీం మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇవ్వడం గమనార్హం. ఇక ఈ టీం ను ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు. ఈ సిరీస్ ద్వారా యంగ్ క్రికెటర్ లు అయిన ఋతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, జితేష్ శర్మ, ప్రిథ్వి షా , శివమ్ మావి , రాహుల్ త్రిపాఠి లకు మరో సువర్ణావకాశం లభించింది. ఈసారి అయినా వీరు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని రాణిస్తారా చూడాలి.

ఇక కివీస్ టీం కు యంగ్ ఆల్ రౌండర్ మిచెల్ శాంట్ నర్ సారధ్యాన్ని వహించనున్నాడు. ఈ టీం లో కూడా అందరూ యువ ఆటగాళ్లే కావడం విశేషం.. ఫిన్ అలెన్, బ్రెసెవెల్ , చాప్ మాన్ , డేన్ క్లివర్ లకు మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఇక ఏ క్షణంలో అయినా మ్యాచ్ ను మలుపు తిప్పగల ఫెర్గుసన్, మిచెల్ , ఫిలిప్స్ , సోది లతో ఇందునియా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే వన్ డే సిరీస్ ను కోల్పోయిన కివీస్ కనీసం టీ 20 సిరీస్ ను అయినా గెలుచుకుంటుందా చూడాలి .    

మరింత సమాచారం తెలుసుకోండి: