
అయితే ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, రోహిత్ లకు విశ్రాంతి ప్రకటిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇద్దరితో పాటు మరికొంతమంది కీలక ప్లేయర్లకు కూడా విశ్రాంతి ప్రకటించారు అని చెప్పాలి. అయితే ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్స్ తో కూడిన టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టి20 సిరీస్ ఆడుతుంది. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లబోతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే వన్డే టి20 సిరీస్ తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఆడబోతుంది. సౌత్ ఆఫ్రికా పర్యటనలో.. ఆడబోయే మూడు ఫార్మాట్ లకు సంబంధించిన జట్టు వివరాలను బీసీసీఐ ప్రకటించింది.
కాగా వన్డే టి20 ఫార్మట్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ల పేర్లు లేకపోవడం చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు జట్టులో లేకపోవడం వెనక కారణమేంటి అన్న విషయాన్ని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసింది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఈ పర్యటనలో లిమిటెడ్ ఓవర్స్ నుంచి విశ్రాంతి కావాలని కోరారు అంటూ బీసీసీఐ తెలిపింది. ఇక షమి వైద్య చికిత్స తీసుకుంటున్న కారణంగా కేవలం టెస్టులకు మాత్రమే ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చింది బిసిసిఐ. ఈ క్రమంలోనే బీసీసీఐ వివరణతో అటు అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.