టాప్ మొబైల్ కంపెనీలలో ఒకటి వివో.. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల ఫోన్లు మార్కెట్ లోకి చాలానే వచ్చాయి. ఇప్పుడు మరో అప్‌గ్రేడ్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. 2020 వెర్షన్‌లో అందించిన ఫీచర్లతో పాటు కొన్ని అప్డేటెడ్ ఫీచర్లను దీనిలో చేర్చింది. అయితే, వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్ప్లే నాచ్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 20: 9 డిస్ప్లే, 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లలో ఎటువంటి మార్పు చేయలేదు. కాగా, పాత వేరియంట్లో మీడియాటెక్ హెలియో పి 35 SoC ప్రాసెసర్ను అందించగా.. కొత్త వేరియంట్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC ప్రాసెసర్ను చేర్చింది.


ఇకపోతే ఈ వేరియంట్ ధర ను చూస్తే..వివో వై 12 ఎస్ అప్డేటెడ్ మోడల్ సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీనిలో 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ను అందించింది. దీని ధరను 10,500 గా కంపెనీ నిర్ణయించింది.వియత్నాంలో విడుదలైన ఈ ఫోన్ ఐ-బ్లూ, మిస్టీరియస్ బ్లాక్ కలర్స్లో లభిస్తుంది. వియాత్నాం ఈ-కామర్స్ సైట్ఎఫ్‌పిటి షాప్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. గతంలో వచ్చిన ఫోన్లు ఇప్పుడు తక్కువ ధరలో దొరుకుతున్నాయి.


ఆండ్రాయిడ్ 11 ఓఎస్ 11తో పనిచేస్తుంది. దీనిలో 20: 9 కారక నిష్పత్తితో కూడిన 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC తో పాటు 3GB ram తో పనిచేస్తుంది. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ను కూడా చేర్చింది. ఈ సెటప్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్లను అందించింది. మిగిలిన ఫీచర్లు అన్నీ కూడా గతంలో వచ్చిన ఫోన్ల మాదిరిగానే ఉంటుందని అంటున్నారు.. మరి ఎలా టాక్ ను అందుకుంటుంది అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: