ఆఫ్గనిస్థాన్ దేశంలో కందహార్ నగరంలో స్పిన్ బోల్దాక్ జిల్లాలో, ఆదేశ బలగాలకు అలాగే తాలిబన్ల మధ్య శుక్రవారం జరిగిన భీకరమైన ఘర్షణలో, భారతదేశానికి చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దికీ తన ప్రాణాలను కోల్పోయారు. డానిష్ సిద్ధికి అక్కడ ఎందుకు మృతి చెందారు అనే విషయంపై ఆరా తీయగా.. ఆయన రాయిటర్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న దాడులకు సంబంధించిన వార్తలను కవర్ చేయడానికి అక్కడికి వెళ్ళినట్లు సమాచారం. ఇక ఈయన ఆఫ్ఘనిస్తాన్ దళాలతో కలసి అక్కడున్న వార్తలను కవర్ చేస్తున్న సమయంలో, అనుకోకుండా తాలిబన్ల దాడులకు బలైనట్లు , అక్కడి భారత రాయబారి అయిన ఫరీద్ మమూంద్ జే అధికారిక ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగింది.


అంతే పాటు ఫరీద్ మమూంద్ జే తన ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందిస్తూనే .." నిన్న రాత్రి సమయంలో కందహార్లో డానిష్ సిద్దికిని, హత్య చేసిన విషాద వార్తలతో రాయిటర్స్ సంస్థ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇండియన్ జర్నలిస్ట్ అలాగే పులిట్జర్ ప్రైజ్ విజేత అయిన సిద్ధికి ఆఫ్ఘన్ లో తాలిబన్ల దాడులకు మరణించడం విషాదకరంగా ఉంది. ఆయన కాబూల్‌కు బయలుదేరే ముందు 2 వారాల క్రితమే ఆయనను కలిశాను. " మా జీవితాలలో ఇదొక విషాద సంఘటన అని ఆయన తెలిపారు.


అలాగే రైటర్స్ సంస్థ అధ్యక్షుడు అయిన మైకేల్ ఫ్రీడెన్ బెర్గ్ లతో  పాటు ఎడిటర్-ఇన్-చీఫ్ అలెగ్జాండ్రా గాలనో కూడా తమ ఫోటోగ్రాఫర్ ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం అంటూ తెలపడం జరిగింది. సిద్ధికి ఇండియా టుడే  సంస్థలో టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్ గా 2008 నుంచి 2010 వరకు తన వృత్తిని చేపట్టి,  తర్వాత రాయిటర్ సంస్థలో  ఫోటోగ్రాఫర్ గా ఉద్యోగంలో వుండేవారు.ఫోటో జర్నలిస్ట్‌గా, డానిష్ సిద్దిఖీ ప్రపంచవ్యాప్తంగా  ఉన్న అనేక రకాల సమస్యలను కవర్ చేసేవారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం తోపాటు  హాంకాంగ్ నిరసనలు అలాగే  నేపాల్ భూకంపాలు వంటివి ప్రధానంగా ఫోకస్ చేసేవారు.


ఇక ఈయన తోపాటు ఒక సైనిక అధికారి కూడా మరణించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ దాడులు జరగడానికి కారణం.. ఆఫ్గాన్ నుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవడం. అందుకే ఆదేశం గత కొద్ది రోజులుగా హింసాత్మక సంఘటనలతో ఇబ్బంది పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: