రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది జీవచ్ఛవాలుగా మారిపోయి బతుకు భారం గా మార్చుకుంటున్నారు. మరికొంతమంది చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వెరసి ఇలా రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవలే ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక బైక్ ని కారు ఢీ కొట్టిన ఘటనలో బైక్ గాల్లో ఎగిరి పల్టీలు కొట్టిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
ఈ వీడియో చూసిన తర్వాత ఇది సినిమా ఫ్రంట్ కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది అని అందరూ అనుకుంటున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ఘజియాబాద్లో వెలుగులోకి వచ్చింది. రహదారిపై ఒక కారు దూసుకు వస్తుంది. అదే సమయంలో ఒక బైక్ ఆ రహదారి మీదికి వచ్చింది. దీంతో అదే వేగంతో బైక్ను ఢీకొట్టింది కారు. దీంతో బైక్ రైడర్ కొన్ని సెకండ్ల పాటు కాళ్లు పల్టీలు కొట్టి కారు మీద నుంచి కిందకు జారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భయపడిపోయిన కారు డ్రైవర్ కారు అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసిటివి ఫుటేజీలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి