ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లా క‌దిరి ప‌ట్ట‌ణం ఎన్జీఓ కాల‌నీలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున దారి దోపిడి దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు.  క‌దిరిలోని రెండు ప‌క్క ప‌క్క ఇండ్లలో దొంగ‌లు దాడికి దిగారు. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై దాడి చేప‌ట్టారు. అందులో డ‌బ్బులు న‌గ‌దును దోచుకుపోయారు. దోపిడి దొంగ‌ల దాడిలో ఉషారాణి అనే ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందిన‌ది. ఆమె ప‌క్కింట్లో ఉండే శివ‌మ్మ‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మెరుగైన వైద్యం కోసం బెంగ‌ళూరుకు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తును చేప‌డుతున్నారు క‌దిరి పోలీసులు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌లో గ‌త కొంత కాలం నుంచి దొంగ‌ల బెడ‌ద త‌గ్గింద‌నుకుంటున్న త‌రుణంలోనే తాజాగా అనంత‌పురం జిల్లాలో దొంగ‌లు అల‌జ‌డి సృష్టించ‌డం గ‌మ‌నార్హం. దొంగ‌ల నివార‌ణ‌కు పోలీసులు ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో సీసీ కెమెరాల‌ను అమ‌ర్చుతున్నా కానీ దొంగ‌ల ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. తెలంగాణ‌లో హ‌న్మ‌కొండ జిల్లా కేంద్రంలో నిన్న బ్యాంకు నుంచి డ‌బ్బు డ్రా చేసి కారులో పెట్టి లాక్ వేసినా కానీ దొంగ‌లు కారు అద్దం ప‌గుల‌గొట్టి మ‌రీ రూ.25ల‌క్ష‌ల‌ను దోచుకెళ్లారు. ఈ రెండు రోజుల్లోనే  రెండు రాష్ట్రాల్లో దొంగ‌లు బీభ‌త్సమును సృష్టిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: