ఏపీ రాజకీయాలు కూల్చివేతలు, రాళ్ల దాడుల చుట్టూ కొనసాగుతోంది. అయితే.. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు రోజుకో కొత్త డ్రామాలకు తెరలేపుతున్నాయని వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. పవన్‍ కల్యాణ్‍, చంద్రబాబు నాయుడు పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేస్తున్నారు. నందిగామ టీడీపీ సభలో రాళ్ళు వేసిన వాళ్ళు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా వేసి ఉంటారన్నారు.


ఇప్పటంలో పవన్‍ కళ్యాణ్‍ రాజకీయం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాళ్లదాడిపై చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని చూసి తెదేపా నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే సమయం వృధా అవుతుందని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర విశాఖ గర్జన పక్కదారి పట్టించడానికి మంత్రులపై దాడి చేయించారని పవన్ కళ్యాణ్ పై రెక్కీ చేశారంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: