పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ వీకెండ్ వచ్చి రెండు సోషల్ మీడియా పోస్టులు పెట్టి వెళ్లిపోతున్నారని వైసీపీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. మంచి కంటెంట్ ఉండాలి లేకపోతె ఎలా సినిమా ఫ్లాప్ అవుతుందో, జనసేన కూడా అలాగే  ఫ్లాప్ అవుతుందని వైసీపీ మంత్రి రోజా అన్నారు.


వేరే పార్టీ జెండా మోస్తుంటే చూసి జనాలు నవ్వుకుంటున్నారని.. ఏదో కొత్త వాహనం కొంటేనో.. కలర్ ఫుల్ షర్ట్ వేసుకుని వస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు లేరని వైసీపీ మంత్రి రోజా అన్నారు. ప్రధాని మోదీతో, మిగిలిన రాష్ట్రాల నాయకులు, జగనన్న పధకాలను అనుసరిస్తున్నారని వైసీపీ మంత్రి రోజా అన్నారు. సీఎం జగన్ మంచి విజన్ ఉన్న నాయకుడు అందుకే నమ్మకంగా ఉన్నారు మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు అని వైసీపీ మంత్రి రోజా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: