
తాజాగా తెలంగాణలో ఒక రైతు వినూత్నంగా నిరసన చేసాడు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పొన్నెకల్లుకు చెందిన రైతు వినూత్న నిరసన హాట్ టాపిక్ గా మారింది. తన భూమి తనకి ఇప్పించాలని నాగలితో నడుస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ నాగలితో పాదయాత్ర చేశారు. సీపీని కలిసి తన బాధని చెప్పుకుంటా అని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.