ఉత్తర్​ ప్రదేశ్​లోని అయోధ్య జిల్లాలో సెక్షన్​ 144 సెక్షన్​ను విధించారు అధికారులు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. రానున్న పండుగల దృష్ట్యా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.అయోధ్యలో నిర్వహించే దీపోత్సవ కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ పాల్గొంటారని జిల్లా మేజిస్ట్రేట్​ అనూజ్​ కుమార్ చెప్పారు. పండుగల మధ్యలోనే కొన్ని కీలక పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వెల్లడించారు.


 ఆ సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఈ నిబంధనలను విధించామని అన్నారు.డిసెంబర్​ 17 వరకు అయోధ్య జిల్లా వ్యాప్తంగా ఈ 144 సెక్షన్​ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: