ఉత్తర్ ప్రదేశ్ లోని బండా జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారం 5 మంది అబ్బాయిలు 12 ఏళ్ల మైనర్ బాలికను నది ఒడ్డుకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు. 5 మందిలో ముగ్గురు మాత్రమే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురు మైనర్ అబ్బాయిలను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసు బండా జిల్లాలోని తింద్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఆగస్టు 14 సాయంత్రం జరిగినట్లు పోలీసు అధికారి ప్రదీప్ కుమార్ యాదవ్ శనివారం తెలిపారు. బాలిక తల్లి ఆగస్టు 19న 5 మంది నిందితులపై ఫిర్యాదు చేసింది. గ్యాంగ్ రేప్ ఆరోపణలతో 13 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు మైనర్ అబ్బాయిలను ఈ రోజు అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. సంఘటన జరిగినప్పుడు బాధితురాలు బాత్రూం కోసం యమునా నది ఒడ్డుకు వెళ్లిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: