జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులతో ఒక గ్రూప్ పెట్టుకున్నాడని సినిమా ఫంక్షన్లకు అతని అభిమానులను పంపిస్తున్నారని పోసాని కృష్ణమురళి కాసేపటి క్రితం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించడంతో గత రాత్రి నుంచి తనకు ఎన్నో ఫోన్లు వచ్చాయని పోసాని కృష్ణమురళి కాసేపటి క్రితం మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పవన్ కళ్యాణ్ ని బహిరంగంగా హెచ్చరించారని అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. గత రాత్రి నుంచి తనకు బూతులు తిడుతూ మెసేజ్లు వస్తున్నాయని అలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఫోన్లు చేసి తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించకపోతే తాను బయటకు వచ్చే వాడిని కాదని పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: