భార‌త దేశంలో మ‌రో ఓమిక్రాన్ కేసు ఇవాళ‌ న‌మోదు అయింది. భార‌త ప్ర‌ధాని స్వ‌రాష్ట్రమైన గుజరాత్‌లో ఈ కేసు న‌మోదు అయిన‌ది. గుజ‌రాత్‌లో బ‌య‌ట‌ప‌డ్డ ఓమిక్రాన్ సౌత్ ఆప్రికా నుంచి వ‌చ్చి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు కేసులు న‌మోదు అయ్యాయి. క‌ర్నాట‌క‌లో రెండు కేసులు న‌మోదు కాగా.. తాజాగా న‌మోదు అయిన కేసుతో మొత్తం భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 3 ఓమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.

అత‌నికి సంబంధించిన కాంటాక్టుల‌ను ఇప్ప‌టికే గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే  తొలిసారిగా రెండు కేసులు కర్ణాటక రాష్ట్రంలోనే నమోదు అయ్యాయి ఒమిక్రాన్ కేసులు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మొన్న గురువారం ప్ర‌క‌టించిన‌ది.  అందులో ఓమిక్రాన్ సోకిన క‌ర్నాట‌క చెందిన ఇద్ద‌రూ పురుషుల‌కు 44, 66 ఏండ్ల వ‌య‌స్సు అని ఇటీవ‌ల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. అయితే గుజ‌రాత్‌లో నూత‌నంగా ఓమిక్రాన్ కేసు బ‌య‌టికి రావ‌డంతో ఆ వ్య‌క్తి స‌న్నిహితంగా ఉన్న వ్య‌క్తుల‌ను ట్రేస్ చేయ‌డం మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: