రాజకీయ నాయకులు సమాజాన్ని మందుండి నడిపించాలి. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తాజాగా ఆ పని చేశారు. కడప జిల్లా వేంపల్లి లో స్నేహిత అమృత హస్తం సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన నేత్ర దానం చేస్తానని హామీ ఇచ్చి వీలునామా రాశారు. వేంపల్లిలో నిర్వహించిన నేత్రదాన వీలునామ కార్యక్రమం లో తులసి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి వారి సతీమణి తో సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ మరణాంతరం కళ్లను దానం చేస్తామన్నారు. స్నేహిత అమృత హస్తం సేవాసమితి వారికి తమ కళ్ళను దానం చేస్తున్నట్లు వీలునామా రాసి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తులసి రెడ్డి మాట్లాడుతూ సర్వేంద్రియం నయనం ప్రధానం.. అటువంటి నేత్రదానం అన్ని దానాల కంటే ప్రధానమన్నారు. అంతేకాకుండా ఒకరి నేత్రదానం ఇద్దరు ఆంధ్రులకు చూపునిస్తుందన్నారు.. మరణాంతరం కూడా ప్రపంచాన్ని చూడగలిగే మహా భాగ్యము కలిగిస్తుంది అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: