ఒక వధువు సాయంత్రం పెళ్లి అవ్వడం తో మేకప్ వేసుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది . ఆ తర్వాత ఆమెని దారుణంగా చంపేశారు. అయితే అసలు ఏం జరిగింది....?  ఎవరు ఈమెని చంపారు.....?   వివరాలు తెలుసు కోవడానికి పూర్తిగా చదవండి...  ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్లోని రత్లామ్ జిల్లా లో ఈ దారుణ ఘటన జరగడం అందరిని బాధిస్తోంది. ఒక వధువు పెళ్లికి కొన్ని గంటల ముందే దారుణ హత్యకు గురైంది. ఆమె సోదరి తో కలిపి బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది. బ్రైడల్ మేకప్ వేసుకునేందుకు వెళ్లిన ఆ పెళ్లి కూతురుని ఒక యువకుడు కత్తి తో గొంతు కోసి చంపేశాడు.

 

రత్లామ్ జిల్లా జవహర్ గ్రామానికి చెందిన యువతికి ఓ యువకుడి తో శనివారం సాయంత్రం పెళ్లి జరగాల్సి ఉంది. ఇందు కారణం గానే తన అక్క తో కలిసి ఆమె బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది. అయితే అక్కడ మేకప్ వేసుకునే సమయం లో ఒక యువకుడు లోపలికి ప్రవేశించి కత్తి తో ఆమె గొంతుని కోసి పరారై పోయాడు. కొద్ది సేపట్లో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాల్సిన ఆమె హత్యకి గురైంది. 

 

ఈ సంఘటన చూసి స్థానికులు ఆమెని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఈ లోగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. హత్య పై సమాచారం పోలీసులు అందుకుని వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అంతే కాకుండా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం కూడా వచ్చి ఆధారాలు సేకరించాయి. ఆ నిందితుడుని గాలిస్తున్నారు పోలీసులు. అయితే ఈ హత్యకు కారణం ప్రేమ వ్యవహారమా లేక ఏమైనా కక్షలా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కళకళలాడాల్సిన ఇల్లు వధువు హత్య తో  ఆవేదన తో నిండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: