గతంలో ఫీజు రీయంబర్స్ మెంట్ కళాశాలకు వస్తుండేవి. కానీ విద్యా దీవెన అనే కార్యక్రమంతో వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులను పంపిస్తున్నారు. లోకేష్ మాత్రం ఈ పథకాన్ని రద్దు చేసి నేరుగా కళాశాలలకే డబ్బులను చెల్లిస్తాం అంటున్నారు. మధ్య తరగతి తల్లులు కొంతమంది చెల్లిస్తున్నారు. కానీ కొందరు ఒకటి రెండు సార్లు చెల్లించి తర్వాత ఖర్చపోయాయని చెబుతున్నారు.
డబ్బులు తీసుకుంటున్న తల్లిదండ్రులు వాటిని కట్టేందుకు వెళ్లినపుడు విద్యార్థి చదువు బాగోగులు గురించి అడుగుతారు. కానీ కొన్ని సార్లు ఆ డబ్బులను ఖర్చు చేయడం వల్ల కాలేజీల యాజమాన్యాలు పై చదువులకు అంగీకరించడం లేదు. ఇలా పై చదువులకు ఇబ్బంది పడకుండా గతంలో ఇచ్చిన విధంగానే ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తామని ప్రకటించారు. దీని వల్ల విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. నేరుగా కళాశాలలకు ప్రభుత్వం ఇచ్చే మనీ వెళ్లిపోతుంది. ఏ విద్యార్థికి ఎంత ఇవ్వాలి, తదితర వివరాలను ప్రభుత్వం చూసుకుంటుంది. పథకం ఒకటే కానీ డబ్బులు ఇచ్చే విధానమే వేరు. మరి లోకేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రజలకు నచ్చుతుందా లేదా చూడాలి.