జాతీయ మీడియా అయిన రిపబ్లిక్ టీవీ చంద్రబాబును సమ్మిట్ కు ఇన్వైట్ చేయడం, అక్కడ ప్రసంగం చేయమని అడగడం కొత్త చర్చలకు దారి తీసింది. గత ఎన్నికల్లో బీజేపీతో విబేధించి కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబు కు ప్రజలు 23 సీట్లతోనే సరిపెట్టారు. అంతకుముందు బీజేపీతో రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మధ్యలో తెగదెంపులు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు రిపబ్లిక్ టీవీ ద్వారా బీజేపీకి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన కూడా ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం, ఇతర పార్టీ నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు.
2019 ఎన్నికల సమయంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఇతర ఇండిపెండెంట్లు అందరూ వైసీపీ ముందు చతికిల బడిపోయారు. ఒక వేళ బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని బాబు నమ్ముతున్నారా.. వారి అవసరం రాష్ట్రానికి ఉంటుందని భావిస్తున్నారా... రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటే ప్రయోజనం కలుగుతుందనే అనుకుంటున్నారా.. ఏమైనా మళ్లీ బీజేపీకి దగ్గర కావాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది.