పేద విద్యార్థులు అనారోగ్యానికి గురిఅవుతున్నారని ఆయా సంఘాల నాయకులు కమిషన్ ను దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో గత నెల రోజులుగా ఈ పాఠశాలలో లక్షల మంది పేద విద్యార్థులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. సరైన పోషక ఆహారం, సురక్షిత మంచినీరు, బట్టలు, చెప్పులు, కాస్మొటిక్ వస్తువులు వారికి ఇవ్వడం లేదు. కనీసం రోగమొస్తే వైద్యం, మందుబిళ్లలు, వైద్యులు, కనీసం సిస్టర్స్ కూడా అందుబాటులో లేరని వారు వివరించారు.
చాలా పాఠశాలలకు స్వంత భవనాలు లేవు. చిన్న చిన్న అద్దె భవనాలు, ఊరు చివర, అడవుల పక్కన గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో... పాములు, తేళ్లు ఇతర విషపురుగులు వచ్చి విద్యార్థులను కాటేస్తున్నాయి. విష పురుగుల కాట్లతో ఈ నెలలోనే ఇద్దరు విద్యార్థులు మరణించారు. గతంలోనూ ఇలా చాలామంది విద్యార్థులు చనిపోయరు.
రాజ్యాంగం ప్రకారం పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక విద్యను అందించడం ఒక హక్కు అంటున్న ఆయా సంఘాల నేతలు... ఈ హక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. విద్యార్థుల ప్రాధమిక హక్కులను కాపాడి... హక్కులను ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు తీసుకొని వారు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని ఆయా సంఘాల నేతలు కోరారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి