బ్రీత్ అనలైజర్ లో తాగినట్టు వచ్చినా ఉద్యోగం తీసేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఆర్టీసీ డ్రైవర్ ఎ.వెంకటిని మద్యం తాగారన్న అభియోగంతో ఉద్యోగం నుంచి తొలగించిన చర్యను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష మాత్రమే ప్రాథమిక ఆధారమని, రక్తం మూత్ర పరీక్షలు లేకుండా శిక్ష విధించడం చట్టవిరుద్ధమని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు స్పష్టం చేశారు.

మధిర డిపో మేనేజర్ గత ఏడాది ఏప్రిల్ 25న జారీ చేసిన తొలగింపు ఉత్తర్వును రద్దు చేస్తూ డ్రైవర్‌ను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశించారు.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు కోర్టు ఆమోదించింది. మద్యం అలవాటు లేని వెంకటి విధులు నిర్వహించలేదని, వైద్య పరీక్షలు చేయాలని అభ్యర్థించినా అధికారులు నిరాకరించారని తెలిపారు. ధర్నా ఉదయం 5.30కు మొదలైనా 11.30కు మాత్రమే పాల్గొన్నారని, పోలీసులు చర్యలు తీసుకోలేదని వివరించారు.

ధర్నాలో పాల్గొన్న 13 మందిపై చర్యలు లేకుండా ఒక్కరిపై మాత్రమే శిక్ష విధించడం ఏకపక్షమని న్యాయవాది ఆరోపించారు.కోర్టు తీర్పులో బ్రీత్ ఎనలైజర్ ఫలితాలు మద్యం సేవనానికి తుది ఆధారం కాదని స్పష్టం చేసింది. తదుపరి రక్త మూత్ర పరీక్షలు తప్పనిసరని పేర్కొంది. ధర్నా పాల్గొన్న ఇతరులను వదిలేసి ఒక్కరిపై మాత్రమే చర్య తీసుకోవడం అన్యాయమని ఆక్షేపించింది.

రీజనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.మొత్తంగా హైకోర్టు ఆర్టీసీ అధికారులకు కీలక సందేశం ఇచ్చింది. ఉద్యోగుల హక్కులు కాపాడుతూ నిబంధనలు సరిగ్గా పాటించాలని ఆదేశించింది. వెంకటి తిరిగి విధుల్లో చేరడంతో ఇతర ఉద్యోగులకు ధైర్యం కలిగింది.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: