పసిడి ప్రియులకు ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు ఝలక్ ఇస్తున్నాయి.నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి.బంగారం ధరలు కాస్త పెరిగితే వెండి మాత్రం మూడు రోజులుగా కిందకు దిగి వస్తుంది..ఈరోజు కూడా మార్కెట్ లో వెండి ధరలు భారీగా కిందకు వచ్చాయి. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు 22 క్యారెట్లకు 150 రూపాయలు పెరుగగా, 24 క్యారెట్లకు 160 రూపాయలు పెరిగిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇకపోతే ఈరోజు కిలో వెండి ధర 300 ల మేర కిందకు వచ్చింది.అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయని నిపుణులు అంటున్నారు..


ఇకపోతే దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,780 గా ఉంది.చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.49,460గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,960గా ఉంది.హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేర పెరిగింది.పసిడి రేటు రూ.53,780కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ర. 150 పెరుగుదలతో రూ. 49,300కు చేరింది.


పసిడి ధరలు పరుగెడుతుంటే.. వెండి ధర మాత్రం తగ్గుతోంది. ఈరోజు కూడా వెలవెలబోయింది. వరసగా మూడో రోజు వెండి ధర తగ్గింది. వెండి రూ.300 క్షీణించింది. దీంతో దీని రేటు కేజీకి రూ.73 వేలకు తగ్గింది..వెండి వస్తవులు కొనాలని భావించె వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.వెండి వస్తువులకు కూడా మార్కెట్ లో డిమాండ్ భారీగా పెరిగింది.. దేశీయ కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: