పండగలు వస్తున్నాయి.వాటితో పాటు ఆఫర్లు తెస్తున్నాయి.ఈ దసరా,దీపావళి సందర్భంగా ప్రతి కంపెనీలు వినియోగ దారుల్ని ఆకట్టుకోవడానికి తాము సేల్ చేసే ప్రొడక్ట్స్‌లో ఎన్నో ఆఫర్లను ప్రకటించడానికి ముందుకు వస్తాయి.వాటిలో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కనీవినీ ఎరుగని రాయితీలు,బోల్డన్ని ఆఫర్లతో వినియోగదారులను ఊరిస్తోంది.ఈ నెల 29 నుంచి ‘బిగ్‌ బిలియన్ డేస్’ సేల్‌‌తో ఆఫర్లకు తెరతీయ బోతోంది.వచ్చే నెల 4 వ తేది వరకు కొనసాగనున్న సేల్‌లో వందలాది డీల్స్ అందుబాటులోకి రానున్నాయి.ఇన్ని ఆఫర్లు రమ్మంటున్న చేతిలో క్రెడిట్ కార్డు లేదే అని బాధపడుతున్న వారికి ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది.ఎటు వంటి కార్డులు అవసరం లేకుండా ఏకంగా లక్ష రూపాయల వరకు షాపింగ్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని వినియోగదారులకు అందించేందుకు రెడీగా వుంది.



ఈ ఆఫర్‌ను ముందు కొనండి..తర్వాత చెల్లించండని అందుబాటులోకి తీసుకొస్తోంది.ఈ సందర్భంగా డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన పని కూడా లేదని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు మూడు పేమెంట్ ఆప్షన్లు ఉంటాయట. అందులో మొదటిది..జీరో వడ్డీతో తర్వాత నెల చెల్లించడం.రెండోది జీరో వడ్డీతో మూడు నెలల్లో ఈఎంఐ ద్వారా చెల్లించడం.చివరిది 12 నెలల ఈఎంఐ విధానంలో చెల్లించడం.ఇందుకోసం ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.కాకపోతే డిజిటల్ కేవైసీ ప్రాసెస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది.పండుగ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగించకుండా,ఏ పర్సనల్ లోన్ తీసుకోకుండా ప్రోత్సహించేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.ఇక ఈ ఆఫర్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.



ముందుగా పాన్ నంబరు,ఇతర వివరాలు,ఎంత వరకు కొనుగోలు చేయాలనుకుంటున్నారన్న వివరాలను నమోదు చేయాలి.
రెండు నిమిషాల్లో పూర్తయ్యే కేవైసీ వివరాలను ఎంటర్ చేయాలి..కార్డ్‌లెస్ క్రెడిట్ ఆప్షన్ ద్వారా షాపింగ్ చేసుకోవాలి..మై అకౌంట్స్, కార్డ్‌లెస్ క్రెడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి క్రెడిట్ లిమిట్‌ను చెక్ చేసుకోవచ్చు..ఈ అమౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా ప్రతి నెల 15 వ తేదిన చెల్లించాలి..ఇంకెందుకు ఆలోచన వెంటనే స్టార్ట్ అవ్వండి మీ కోరికలు ఏవైన ఉంటే నెరవేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: