
చాక్లెట్లలో కేఫైన్ ఉంటుంది, ఇది ఈసోఫెగల్ స్ఫింక్టర్ను సడలించి ఎసిడిటీ పెరగడానికి దారితీస్తుంది. ఎక్కువ చక్కెర ఉన్న ఆహారం కూడా ఎసిడిటీకి కారణమవుతుంది. వీటిలో కేఫైన్, గ్యాస్ కలిగి ఉంటుంది. ఇవి కడుపులో గ్యాస్, మంట పెంచుతాయి. సమోసా, పకోడీ, వడ, పూరి, బజ్జీ లాంటి ఆహారం కడుపులో వేసిన వెంటనే అసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. డైజెషన్కు కూడా అవి భారంగా మారతాయి. బర్గర్లు, పిజ్జాలు, నూడుల్స్, కూరకాయలు లేని జంక్ ఫుడ్ ఎసిడిటీకి బాగా దోహదం చేస్తాయి. మానకపోతే మలబద్ధకం, కడుపులో మంట కలిగించే ప్రమాదం ఉంటుంది.
ఆల్కహాల్, సిగరెట్లు స్టమక్ లైనింగ్ను ఇబ్బంది పెట్టి, అసిడ్ ప్రొడక్షన్ పెంచేలా చేస్తాయి. ఇవి ఎసిడిటీతో పాటు ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలకూ కారణమవుతాయి. భోజనం తర్వాత వెంటనే పడుకోవడం, భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం పూర్తిగా జీర్ణం కాక ముందే అసిడ్ ఎసోఫేగస్కి చేరే అవకాశం ఉంటుంది. కనీసం భోజనం చేసిన తర్వాత 2 గంటల పాటు నడక లేదా కూర్చున్న పోజిషన్లో ఉండండి. రోజులో ఎక్కువసార్లు తక్కువ తక్కువగా తినండి. ఎక్కువగా తినడం వల్ల అసిడ్ ఉత్పత్తి అధికమవుతుంది.