మనలో చాలామంది కొనడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించే పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. ఈ పండు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ ఇతర పండ్లతో పోల్చి చూస్తే ఈ పండు ఒకింత ఖరీదైన పండు కావడంతో ఈ పండు కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఉండేది. అయితే ఒకప్పుడు 200 రూపాయలు పలికిన ఈ పండు ప్రస్తుతం కేవలం 10 రూపాయలు పలుకుతోంది.

పోషకాలు ఎక్కువగా లభించే  ఈ పండు ప్రస్తుతం హైదరాబాద్  లాంటి నగరాలలో  50 రూపాయలకే  6 కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.  గత కొన్నేళ్లలో  తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ పండు  వినియోగం  ఊహించని స్థాయిలో పెరిగింది.  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో  సైతం  ఈ పండ్ల  సాగు పెరిగి  ప్రస్తుతం   దిగుమతులు ఎక్కువ కావడంతో  ఈ పండ్ల ధరలు ఊహించని స్థాయిలో తగ్గుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 ఎకరాకు 6 టన్నుల దిగుబడిని   ఈ పంట సాగు ద్వారా పొందే అవకాశం ఉండగా  పంట చేతికి  వచ్చే వరకు కనీసం 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2000 ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది.  బాట సింగారం మార్కెట్ కు ఊహించని  స్థాయిలో ఈ పండ్ల దిగుమతులు పెరగగా  ధరలు  తగ్గడంతో రైతులకు ఊహించని స్థాయిలో నష్టాలూ వస్తున్నాయి.

గతంలో ఎప్పుడూ ఈ పండుకు ఇలాంటి  పరిస్థితి లేదని  రైతులు వాపోతున్నారు.  గతంలో ఎకరానికి కనీసం లక్ష రూపాయలు  లాభం ఉండేదని  ప్రస్తుతం 2 లక్షల రూపాయల నష్టం  వాపోతున్నారు.  ఇతర రాష్ట్రాల నుంచి  పండ్లు రాకుండా   కఠినతరం  చేస్తే బాగుంటుందని  రైతులు  కోరుతున్నారు.  ఇప్పటికే ఈ  సమస్య వ్యవసాయ శాఖ  దృష్టికి రాగా   మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైతులు మాత్రం ధరలు తగ్గడం విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: