ఆ విధంగా ఇటీవల రచయితగా కంటే ఒకింత ఎక్కువగా నటుడిగా బిజీగా మారిన krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి కొద్దిరోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రభుత్వం పై అలానే వైసిపి పై విమర్శలు చేయడంతో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఆయనకు ధీటుగా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఇచ్చారు. అయితే అది అంతటితో ఆగకపోవడం, ఆపైన పలువురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనకి ప్రత్యేకంగా ఫోన్స్ చేసి మరీ తిడుతూ పలు విధాలుగా మెసేజ్ లు కూడా చేస్తున్నారని మీడియా ముందుకు వచ్చిన పోసాని, వారు తన భార్య గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ని అదుపులో పెట్టుకోవాలని, వారు ఇలానే ప్రవర్తించి తనకు ఏదయినా హాని తలపెడితే దానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ పోసాని చెప్పారు.
అయితే ఆ మీటింగ్ తరువాత పలువురు పవన్ ఫ్యాన్స్ పోసాని పైకి దండెత్తడం ఆ తరువాత అయన ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. అనంతరం ఆయన ఇంటిపై అర్ధరాత్రి రాళ్ల దాడి జరిగింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అప్పటి నుండి తాను పని చేస్తున్న సినిమా నిర్మాతలు సహా ఎవరికీ కూడా పోసాని అందుబాటులో లేరని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాకి దూరంగా ఉండడం మేలని భావించిన పోసాని తన సన్నిహితుల ఇంట్లో ఉంటున్నట్లు టాక్. మొత్తంగా కొద్దిరోజులుగా పోసాని జాడ తెలియకపోవడం ఆయన ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు అనే దానిపై త్వరలో సమాచారం వస్తుందేమో అని పలువురు సినిమా వారు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.