బుల్లి తెరపై యాంకర్ రేష్మి, సుడిగాలి సుదీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ స్టేజ్ పై మొదలైన వీరి ప్రయాణం అందరినీ అలరిస్తోంది. గత తొమ్మిదేళ్ళ నుండి లవ్లీ జంటగా వీరికి బుల్లి తెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్ళ ప్రేమ కబుర్లు, పెళ్లి ముచ్చట్లు తరచూ కామన్ అయిపోయాయి. ఇన్నేళ్లు గడుస్తున్నా ఈ జంటకు మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. వీరు షోలో ఉన్నారు అంటే ఏదో తెలియని మ్యాజిక్ స్టేజ్ ను కమ్మేస్తుంది. ఇక "ఢీ" డాన్స్ షోలో వీరు స్పెషల్ అట్రాక్షన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢీ స్టేజ్ పై వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. వీరు కలిసి కనిపిస్తే చాలు మనసులో ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ మొదలవుతుంది.

మనకు తెలియకుండానే హృదయం ఉరకలు వేస్తుంది, అంతటి పాపులారిటీ ఉన్న ఈ జంటను ఢీ డ్యాన్స్ 14 వ సీజన్ లోకి తీసుకోవడం లేదని ఆ ప్లేస్ లో అఖిల్ ఇంకా మోనాల్ గజ్జర్ లు రాబోతున్నారని వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఈ వార్త విన్న వీరి అభిమానులు చాలా నిరాశ చెందుతున్న సమయంలో వీరికి సంబందించిన మరో న్యూస్ వారికి మళ్ళీ హుషారు తెప్పిస్తోంది. ఇంతకీ అదేంటంటే...బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అయిపోగానే ఆ టైం లో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేందుకు త్వరలో ఓంకార్ ఆధ్వర్యంలో వస్తున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే వీరిద్దరూ ఇప్పుడు ఒక షోను సొంత నిర్మాణంలో స్టార్ట్ చేయనున్నారని చిత్రపురిలో వినిపిస్తోంది. ఎలాగు మంచి పేరు ఉన్న వారు కాబట్టి క్లిక్ అవుతుందని నమ్మకంతో ముందుకు వెళుతున్నారు. కానీ వీరి సన్నిహితుల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అంటున్నారు. మరి వీరు ఇందులో సక్సెస్ అవుతారా లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: