ఒకప్పుడు హీరోయిన్ గా కనిపించి అడపాదడపా సినిమాలు చేసిన మాధవి లత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే..ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని. అతణ్ణి ఎవరూ ఏమన్నా కూడా సహించదు.. అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు పవన్ పై తీవ్ర స్థాయిలో  విరుచుకుపడుతుండటంతో పాటుగా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది..


క్రిస్మస్ సందర్బంగా పవన్ తెలుగు ప్రజలకు, అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలుపాడు.ఈ విషెష్ పై మాధవిలత స్పందించింది.పవన్ కల్యాణ్ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని, ఆయన క్రిస్మస్ శుభాకాంక్షల పోస్ట్ అలానే ఉందని మాధవీలత  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో పవన్ కల్యాణ్ గారు ప్రజలకు క్రిస్మస్ విష్ చెయ్యండి. తప్పలేదు కానీ మతాలను రెచ్చగొట్టేలా మాత్రం మెసేజ్ ఇవ్వకండి.


మానవాళికి వంటి పెద్దమాటలు ఎందుకు? మీ పోస్ట్ మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. బైబిల్‌ని బోధించనక్కర్లేదు. రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే.. నిజానికి మీరు చెప్పిన విధంగా ఎవరూ చేయరు..మీరు రాసుకున్న కంటెంట్ నాకు నచ్చలేదు. ఇది అందరికీ గొడవలు పెట్టేలా ఉంది. మీ మీద నాకు మొన్నటి వరకూ గౌరవం ఉంది. కానీ ఇప్పుడు తగ్గింది.జనసేన పేజ్ ను మెయిన్‌టేన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది. మొన్న మీరు కూడా బైబిల్ గురించి గొప్పగా చెప్పారు.. అంత గొప్పగా అందులో ఏమి లేదు.మత మార్పిల్లను ప్రోత్సహిస్తున్నట్లు ఉంది.. హింధువుగా ఉన్న మీరు ఇలా పోస్ట్ చెయ్యడం మంచిది కాదు.అభిమానులు దీన్ని వ్యతిరేకిస్తారు.. ఇది చూసుకొండి..అంటూ పోస్ట్ లో పెర్కొంది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ తో మాధవి పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చెస్తున్నారు.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వరుస రిమెక్ సినిమాల తో బిజీగా వున్నారు. సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ ను విడుదల చేసే ఆలొచన లో చిత్రయూనిట్ వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: