ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత తరంలో కృష్ణ, శోభన్ బాబు ల హవా కొనసాగింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. టాలీవుడ్ లో ఎన్టీఆర్ మెచ్చిన హీరో ఎవరంటే వెంటనే శోభన్ బాబు అంటారు..అందుకే ఆయన సినిమాల్లో ఎక్కువగా శోభన్ బాబు కి స్థానం కల్పించేవారట. తెలుగు తెరపై సోగ్గాడిగా పేరు సంపాదించారు శోభన్ బాబు. ఈ హీరోతో నటించేందుకు అప్పటి హీరోయిన్లు ఎంతో ఉత్సాహం చూపించేవారట. అప్పట్లో శోభన్ బాబు ఎక్కువగా ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా నటించేవారు. రోమాన్స్, ఎమోషనల్ సినిమాల్లో ఎక్కువగా నటించారు శోభన్ బాబు.
సినీ పరిశ్రమలో సిన్సియర్, చాలా క్రమశిక్షణ గల నటుడు అని అప్పట్లోనే ముందు చూపుగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించారని అంటారు. ఇంట్లో ప్రమాదానికి గురై ఆయన మరణించారు. అయితే తెలుగు చిత్ర సీమలో శోభన్ బాబు కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం సినీ రంగంలో వరుసగా బయోపిక్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత జీవితం నేపథ్యంలో రూపొందుతున్న పలు మూవీస్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీస్ లో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ‘తలైవీ’ సినిమా ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా, ఇటీవల ఆమె లుక్ విడుదలైంది. జయ పాత్రలో కంగనా లుక్ అదిరిందని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ మూవీలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక డీఎంకే అధినేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. తాజాగా శోభన్ బాబు పాత్రలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో చేస్తన్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
జయ జీవితంలో కీలక వ్యక్తి అయిన శోభన్ బాబు పాత్రని విజయ్ దేవరకొండ చేస్తున్నాడట. వీరికి సంబంధి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహానటి మూవీలో కీలక పాత్ర పోషించిన విజయ్.. ఇప్పుడు జయలలిత బయోపిక్లోను నటించేందుకు సిద్ధమయ్యాడని చెబుతున్నారు. విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది.