తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో సిద్ శ్రీరామ్ ప్రస్తుతం టాలీవుడ్లో సెన్సేషనల్ సింగర్. ఆయన పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీలో ‘సామ జవర గమనా’ సాంగ్ యూట్యూబ్ సంచలనాలు సృస్టించింది. ఇక యాంకర్ ప్రదీప్ మొదటిసారిగా హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’లో ‘నీలి నీలి ఆకాశం’, ‘రాహు’లో ‘ఏమో ఏమో’.. ఇలా ప్రతి పాట అద్భుతమే. ఇలా తాను పాడిన పాటతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్నాడు.
తాజాగా హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్కుమార్ దర్శకత్వం వహించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఉగాది కానుకగా మార్చి 25న ఈ మూవీ విడుదలవుతుంది. లవర్ తర్వాత రాజ్ తరుణ్ మరోసారి ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా సిద్ శ్రీరామ్ మరో అందమైన పాట ‘ఈ మాయ పేరేమిటో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనూప్ రూబెన్స్ - సిద్ శ్రీరామ్ కాంబోలో వచ్చిన మరో మంచి సాంగ్ ఇది.
నీలి నీలి ఆకాశం పాటను కూడా అనూప్ రూబెన్సే స్వరపరిచారు. కిట్టు సాహిత్యం మనసుకు ఎంతో హత్తుకునేలా అనిపిస్తుంది. సిద్ శ్రీరామ్ మరోసారి ప్రేక్షకులు మరో మధుర గానం వింటారని చిత్ర యూనిట్ అంటున్నారు. ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రాజ్ తరుణ్ కి బాగానే కలిసి వచ్చేలా ఉంది.