విక్టరీ వెంకటేష్ గత ఏడాది రెండు సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్నారు అనే చెప్పాలి. ముందుగా గత ఏడాది సంక్రాంతి సమయంలో రిలీజ్ అయిన ఎఫ్ 2 సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తరువాత తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన వెంకీమామ సినిమాతో మొన్న డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ, దానితో మరొక సక్సెస్ ని అందుకున్నారు. 

 

ఇక ప్రస్తుతం శ్రీకాంత అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో నటిస్తున్న వెంకీ, ఈ సినిమాతో కూడా మరొక హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలని చూస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గత ఏడాది ధనుష్ హీరోగా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అసురన్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతోంది నారప్ప. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన షూటింగ్స్ అని బంద్ కావడంతో ప్రస్తుతం దీని షూట్ ని నిలుపుదల చేసారు. 

 

తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా సినిమాలో కొద్దిపాటి మార్పులు చేసినట్లు టాక్. నాలుగేళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్ తో బ్రాహ్మోత్సవం వంటి పెద్ద డిజాస్టర్ సినిమా తీసిన శ్రీకాంత్ ఈ నారప్పను ఎంత మేర సక్సెస్ చేస్తాడో అని మొదటి నుండి వెంకీ ఫ్యాన్స్ లో కొంత ఆందోళన ఉంది. వాస్తవానికి ఒరిజినల్ మాతృక అయిన అసురన్ కథలో మంచి పవర్ తో పాటు కథనంలో మంచి బలం ఉందని, అలానే దర్శకుడు శ్రీకాంత్ కూడా సినిమా కోసం ఎంతో బాగా కష్టపడుతున్నారని, అటు వెంకీ తో పాటు ఇటు శ్రీకాంత్ కి కూడా నారప్ప మంచి సక్సెస్ ని అందించే అవకాశం ఉందని అంటున్నారు సినిమా యూనిట్ సభ్యులు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: