బాలీవుడ్ అల వైకుంఠపురములో రీమేక్ కు యంగ్ హీరో దొరికాడు. ఫైనల్ గా డబ్ చేయకుండా టీటౌన్ ఈ బ్లాక్ బస్టర్ సినిమాను బీటౌన్ లో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్ రైసింగ్ హీరోటాలీవుడ్ సూపర్ హిట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

 

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి బరిలో రిలీజైన అల్లు అర్జున్ మూవీ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మ్యూజికల్ గా కూడా భారీ సక్సెస్ సాధించడంతో ఈ చిత్రం రీమేక్ పై కొన్నాళ్లుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమాతో బన్నీ, త్రివిక్రమ్ బాలీవుడ్ కు వెళ్లబోతున్నాడని.. అల్లు అరవింద్ ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నాడని రకరకాల ప్రచారం సాగింది. కానీ పైనల్ గా చిత్రం బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. 

 

బాలీవుడ్ లో తెలుగు సినిమాల రీమేక్ సందడి ఎక్కువవుతోంది. ఇప్పటికే జెర్సీ, డియర్ కామ్రేడ్ చిత్రాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో రీమేక్ కానుంది. బీటౌన్ లో సినిమాను అశ్విన్ వర్దె రీమేక్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దేశీ బాయ్స్, డిష్యూం సినిమాలకు దర్శకత్వం వహించిన రోహిత్ ధావన్ డైరక్షన్ చేయబోతున్నాడు. హీరోగా బాలీవుడ్ రైసింగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ నటించబోతున్నాడు. 

 

రీసెంట్ గా కార్తిక్ ఆర్యన్ వీడియో కాల్ ద్వారా స్క్రిప్ట్ విన్నట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో పచ్చజెండా ఊపేశాడట. లాక్ డౌన్ పూర్తి కాగానే మూవీ ఓపెనింగ్ చేద్దామని కార్తీక్ కన్ఫార్మ్ చేస్తాడని సమాచారం. కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే దోస్తానా 2 మూవీ పూర్తి చేశాడు. భూల్ భులయ్యా 2 కూడా చివరి దశలో ఉంది. బీటౌన్ క్రేజీ హీరోగా టర్న్ తీసుకున్న కార్తిక్ ఆర్యన్ కు అల వైకుంఠపురములో మరింత మంచి పేరు తీసుకొస్తుందని చెప్పాలి. మరి స్టైలిష్ స్టార్ క్యారెక్టర్ లో ఆర్యన్ బాలీవుడ్ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: