టాలీవుడ్ లో ఎన్నో ఫ్లాపులు ఎదుర్కొని మళ్ళీ ఇప్పుడు గాడిలో పడిన హీరో నితిన్ అనేది వాస్తవం. ఎన్ని ఫ్లాపులు ఎదుర్కొన్నా సరే సినిమాలు మాత్రం అతను వదులుకోవాలి అని ఎప్పుడు కూడా అనుకున్న సందర్భం లేదు అనేది వాస్తవం. 15 వ‌రుస ప్లాపుల త‌ర్వాత నితిన్ కెరీర్ ఇష్క్‌, గుండెజారి ఘ‌ల్లంత‌య్యిందే లాంటి రెండు వ‌రుస హిట్ల‌తో ట్రాక్ లో ప‌డింది. ఇక ఈ యేడాది వ‌చ్చిన భీష్మ సినిమా మ‌ళ్లీ నితిన్ కెరీర్ కు ఊపిరి లూదింది. 
ఇప్పుడు అతను నిర్మాత గా కూడా బిజీ అవ్వాలని భావిస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న‌ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మ‌ళ్లీ సినిమాలు చేస్తున్నాడు. వ‌కీల్ సాబ్ సినిమాను ఆయన సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళాడు. 

 

ఇప్పుడు పవన్ సినిమాల్లో బిజీ అయ్యాడు కాబట్టి తాను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసే సినిమాకు నితిన్ ని నిర్మాత‌గా ఉండాల‌ని అడిగినట్టు ప్రచారం జరుగుతుంది. కాని నితిన్ మాత్రం అందుకు నో చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు క‌లిసి సినిమా చేద్దాం అని పవన్ అడిగినా సరే నితిన్ మాత్రం ముందుకు రాలేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా ఎవరికి తెలియదు. 

 

నితిన్ కోసం పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కు వేసి అడిగినా సరే నితిన్ మాత్రం ఓకే చెప్పలేదు అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ తో సినిమా చేస్తే నష్టాలు వస్తాయి అని భయపడి ఓకే చెప్పలేదా ?  లేక ఇంకా ఏది అయినా కారణం ఉందా ... నితిన్ ని ఎవరు అయినా వద్దు అన్నారా అనేది తెలియదు. కాగా నితిన్ ఇప్పుడు పెళ్లి బిజీ లో ఉన్నట్టు తెలుస్తుంది. సైలెంట్ గా పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: