సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమా సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే ఈ సినిమాలోని తన క్యారెక్టర్ కోసం ఫుల్ గా హెయిర్ పెంచి మరింత స్టైలిష్ గా సిద్ధమయ్యారు. గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో దీనిని నిర్మించనున్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని త్వరలో అమెరికాలో ప్రారంభించనుంది మూవీ యూనిట్. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు మది ఫోటోగ్రఫిని అందించనున్నారు. బ్యాంక్ మోసాలు, కుంభకోణాల ఆధారంగా పలు కమర్షియల్ హంగులతో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేవిధంగా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తీయనున్నట్లు సమాచారం.

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రేక్షకాభిమానుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఆ విషయాన్ని నేడు కన్ఫర్మ్ చేస్తూ సర్కారు వారి పాట మూవీ యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రత్యేకంగా హీరోయిన్ కీర్తి ని తమ సర్కారు వారి పాట మూవీ లోకి అహ్వాహిస్తూ, ఈ సినిమా తప్పకుండా ఆమెకు ఎంతో మెమొరబుల్ గా నిలిచిపోతుంది అంటూ బర్త్ డే విషెస్ తెలియచేసారు. మరోవైపు పలువురు ఇతర సినిమా ప్రముఖులు, కీర్తి సురేష్ అభిమానులు ఆమెకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు. మరి తొలిసారిగా సూపర్ స్టార్ తో జతకడుతోన్న కీర్తి సురేష్, ఈ సర్కారు వారి పాట తో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: