టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జై లవకుశ. తొలిసారిగా యంగ్ టైగర్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, రాశి ఖన్నా హీరోయిన్లు గా నటించగా ఒక స్పెషల్ సాంగ్ లో తమన్నా భాటియా ఎన్టీఆర్ తో కలిసి ఆడిపాడారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని సాధించింది. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటించి మరో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

తొలిసారిగా మరొక నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుందని మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా ఒక స్టార్ నటి ఎంపికైనట్లు చెబుతున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో మరొక హీరోయిన్ పాత్ర కూడా ఉందని కాగా ఆ పాత్రకు గాను రెండు రోజుల క్రితం యువ నటి నివేదాథామస్ ని ఎంపిక చేశారట దర్శకుడు త్రివిక్రమ్. కథాపరంగా ఆమె పాత్రకు మంచి గుర్తింపు ఉంటుందని అటువంటి పాత్రకి నివేదా మాత్రమే న్యాయం చేయగలదని భావించిన త్రివిక్రమ్ ఫైనల్ గా ఆమెకు ఓటు వేసినట్లు చెబుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం జై లవకుశ తర్వాత మరొక సారి ఎన్టీఆర్, నివేద ల జోడిని వెండితెరపై చూడవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: