యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అరవింద సమేత. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. పూజా హెగ్డే  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందించగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇక దీని అనంతరం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరొక హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రని, అలానే చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో తీస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనబడుతోంది. ఇకపోతే దీని తరువాత మరొక్కసారి త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉందని, అలానే ఈ సినిమాని మంచి పొలిటికల్ సెటైరికల్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని కలగలిపి తీయనున్నట్లు గా కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా కథ ని ఇటీవల త్రివిక్రమ్ మార్పు చేయడం జరిగిందని, కాగా ఆ తాజా కథని ఎన్టీఆర్ కి వినిపించి ఆయన నుండి త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారని అంటున్నారు. అయితే ఈ విషయమై మరొక విధమైన వార్త కూడా ప్రచారం అవుతోంది. దాని ప్రకారం గతంలో ఎన్టీఆర్ కి చెప్పిన కథలో త్రివిక్రమ్ కొంత మార్పులు చేర్పులు చేసారని, అంతే తప్ప సినిమా యొక్క మెయిన్ పాయింట్ అదేనని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ కథనాల్లో ఏది నిజమో, అసలు వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే ఈ సినిమాకి సంబంధించి మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు......!!




మరింత సమాచారం తెలుసుకోండి: