టీవీ ఆర్టిస్టు పవిత్ర పునియా తన పెళ్లాం అని హోటల్ యజమాని సుమిత్ మహేశ్వరీ తెలిపారు. ఇద్దరికి పెళ్లైందని, రహస్యంగా పెట్టిందని సుమిత్ మీడియా ముందు వెళ్లడించడం సంచలనం కలిగిస్తున్నది.

తనతో పాటు మరొక నటుడు పరాస్ ఛబ్రాను కూడా మోసం చేసిందని తెలిపాడు. ఇప్పటికీ మేము భార్యాభర్తలమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పవిత్ర బయట పడనివ్వలేదన్నారు. తనకు భార్యగా ఉంటూనే పరాస్ ఛబ్రాను ప్రేమించిందన్నారు. ఈ విషయం తెలిసిన తరువాత ఆయనకు మెస్సేజ్ పంపించానన్నారు. పవిత్రతో తిరగొచ్చని, మా ఇద్దరికి విడాకులు వచ్చే వరకు ఓపికపట్టాలని, దూకుడు తగ్గించాలని కోరినట్లు సుమిత్ తెలిపాడు. ఆమె మారిపోయిందని, నాలో ఎటువంటి మార్పు రాలేదన్నాడు.

తొలుత ఆమె పరాస్ తో చనువుగా ఉందని తెలియగానే షాక్ అయ్యానని అన్నారు. ఇద్దరం కలిసి వివాహ వార్షికోత్సం చేసుకున్న హోటల్ లోనే వారిద్దరు ఉన్నారని తెలిసి బాధపడ్డాను అన్నారు. తనతో పెళ్లి చేసుకుని వేరేవాడితో చెట్టపట్టాల్ వేసుకుని తిరగడం చూసిన స్నేహితులు కూడా తనను అవమానాలకు గురి చేశారని సుమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన మహిళతో మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం మోసం చేయడమేనని పరాస్ స్పందించాడు. ఆమె భర్త తనకు మెస్సేజ్ చేయడం వల్ల ఈ విషయం తెలిసిందని, ఆమె ను ప్రశ్నించగా మరోక షాకింగ్ విషయం చెప్పిందని పరాస్ అన్నాడు. ఆ విషయాన్ని సందర్భం బట్టి చెబుతానన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: