బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన " వినయ విధేయ రామ " సినిమా తరువాత చరణ్ తెరపై కనిపించలేదు. అయితే చరణ్ అభిమానులు తన సోలో సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల తరువాత చరణ్ తరువాతి సినిమా ఏంటి అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. చరణ్ తరువాతి సినిమాపై ఇప్పటికే రకరకాల దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమాను చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
మరి అలాగే మరొకరి పేరు కూడా బలంగానే వినిపిస్తుంది. "ఎవడు" సినిమాతో చరణ్ కు మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి కూడా లైన్లో ఉన్నారని తెలుస్తుంది. తాజాగా ఇప్పుడు మరొకరి పేరు కూడా వినిపిస్తుంది. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన కూడా చరణ్ కోసం కథ సిద్దం చేస్తున్నట్టు సమాచారం. అయితే వీరిద్దరి కలయిక గూర్చిన వార్తలు ఇప్పటివి కావు,ఎన్నో రోజుల నుండి ఈ కాంబినేషన్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలోని దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసిన త్రివిక్రమ్ చెర్రీతో మాత్రమే చేయాల్సి ఉంది. త్వరలో వీరి ప్రాజెక్ట్ ప్రకటించబడే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి చరణ్ తరువాతి సినిమాపై అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. మరి ఈ గందరగోళానికి చరణ్ ఎప్పుడు చెక్ పెడతాడో చూడాలి.