బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. చాలా రోజులుగా ప్రేమ యాత్రలు చేస్తోన్న లవ్‌బర్డ్స్‌ ఇప్పుడు పెళ్లి పీటలెక్కుతున్నారు. 2020 లాక్‌డౌన్‌లో సోలో లైఫ్‌తో విసిగిపోయిన బాలీవుడ్‌ స్టార్లు ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. సోలో బ్రతుకుకి గుడ్‌బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు.

బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌-నటాషా దలాల్ పెళ్లితో వెడ్డింగ్‌ సీజన్‌ స్టార్ట్ అవుతోంది. చాలా రోజులుగా  ప్రేమలో ఉన్న వరుణ్, నటాషా పోయిన మార్చిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్‌తో వీళ్ల పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు జనవరి 22 నుంచి 26 వరకు అయిదురోజుల పెళ్లి చేసుకోబోతున్నారు వరుణ్, నటాషా.

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ కూడా ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లుగా పెళ్లి పీటలెక్కడానికి ప్రయత్నం చేస్తోన్న వీళ్లకి చాలా అడ్డంకులు వచ్చాయి. రిషికపూర్ ఆరోగ్య సమస్యలతో ఒకసారి, రిషి కపూర్‌ చనిపోయాక మరోసారి రాలియా పెళ్లి వాయిదా పడింది. అయితే ఈ ఏడాది మాత్రం ఆలియా కపూర్‌ కందాన్‌లో అడుగుపెట్టడం ఖాయమంటున్నారు బాలీవుడ్ జనాలు.

ముంబయి నుంచి మాల్దీవ్స్ వరకు ప్రతీ హాలిడే స్పాట్‌లో కనిపించే జంట టైగర్ ష్రాఫ్- దిశా పఠాని. సినిమాల్లో సూపర్‌ పెయిర్‌గా కనిపించే ఈ లవ్‌బర్డ్స్‌కి ఇంట్లో వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వస్తోంది. టైగర్ ఫ్యామిలీ ఆల్రెడీ దిశాని యాక్సెప్ట్‌ చేసిందట. అందుకే ష్రాఫ్ ఫ్యామిలీ అకేషన్స్‌లోనూ మెరుస్తోంది దిశ.

బాలీవుడ్‌ యంగ్‌ కపుల్‌తో పాటు, ముదురు జంటలు కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ మోస్ట్ హీరోయిన్లు, తమకంటే చిన్నవాళ్లతో కలిసి ఏడడుగులు వేయబోతున్నారట. మలైకా అరోరా, సుస్మితాసేన్ ఈ ఏడాదిలోనే కొత్త లైఫ్‌ స్టార్ట్ చేస్తారని చెబుతున్నారు.

మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌ చాన్నాళ్లుగా లవ్‌లో ఉన్నారు. అర్జున్‌ని పెళ్లి చేసుకోవడానికి మలైకా భర్తకి విడాకులు ఇచ్చి మరీ సింగిల్‌గా ఉంటోంది. అర్జున్‌ కపూర్‌ కంటే మలైకా అరోరా 12ఏళ్లు పెద్దదైనా వీళ్ల పెళ్లికి బోనీ కపూర్‌ ఓకే చెప్పాడనే ప్రచారం జరుగుతోంది. అందుకే మలైకా, అర్జున్ ఇద్దరూ కలిసి హాలిడే ట్రిప్స్‌కి కూడా వెళ్తున్నారని చెప్పుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: