తెలుగు ప్రేక్షకులకు ఫిదా సినిమాతో పరిచయమైన సాయి పల్లవి..తొలి సినిమాతోనే తనదైన పెర్ఫామెన్స్‌తో అందరినీ కట్టిపడేసింది. అంతే కాదు.. కమర్షియల్‌ సినిమాల్లోనే నటిస్తానని హీరోయిన్స్‌ అనుకుంటున్న సమయంలో సాయిపల్లవి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలకే ఓటు వేస్తూ నటిస్తూ వచ్చింది. గెలుపు ఓటముల గురించి కాకుండా డిఫరెంట్‌ సినిమాలు చేయాలనే సాయి పల్లవి ఆలోచనే ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టింది.సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది సాయి పల్లవి.. ఇటీవల తమిళంలో వచ్చిన పావ కధైగల్ అనే వెబ్ సిరీస్ లో ఓ గర్భిణీ గా తన అద్భుతమైన నటనతో అందర్నీ కట్టిపడేసింది ఈ న్యాచురల్ బ్యూటీ..

ఒకవైపు అగ్ర హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్ గా దోసుకెళ్తోంది.. ప్రస్తుతం ఈమెకు అన్ని ఇండ్రస్టీల్లోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి... లేటెస్ట్‌ సమాచారం మేరకు సాయిపల్లవి తన ప్రత్యేకతను చాటుకున్నారు.ఏకంగా ఓ కమెడియన్‌తో జోడీ కట్టడానికి ఆమె ఓకే అన్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.వివరాల మేరకు, తమిళంలో కామెడీ పాత్రలు చేసే నటుడు కాళి వెంకట్‌తో సాయిపల్లవి జోడీ కట్టబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కథ, పాత్ర నచ్చడంతో సాయిపల్లవి కూడా కాళి వెంకట్‌తో నటించే అవకాశాలున్నాయని వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన సినీ వర్గాలు షాక్‌ అవుతున్నాయనే చెప్పాలి.
 
ఓ స్టార్‌ హీరోయిన్‌ కమెడియన్‌తో జోడీ కట్టడమనేది గొప్ప విషయమే కదా.. అందుకే సాయిపల్లవి రూటే సపరేటు అని తమిళ తంబీలు అనుకుంటున్నారట.తెలుగులో ప్రస్తుతం సాయిపల్లవి రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరి ..నానితో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో నటిస్తుంది. ఇవి కాకుండా అయ్యప్పనుమ్‌ కోశియమ్‌ రీమేక్ చిత్రంలోనూ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..కానీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: