ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచింది. వినాయకచవితి కారణంగా సెప్టెంబర్ 9 వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో లో రిలీజ్ కానున్న ఈ సినిమా తప్పకుండా విజయ్ దేవరకొండ ఫాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
అదేమిటంటే ఈ సినిమాలో ఒక సర్ ప్రైజింగ్ రోల్ ఉందని కాగా ఆ పాత్రకు గాను సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లలో ఎవరో ఒకరు నటించే అవకాశం గట్టిగా కనబడుతుంది అని అంటున్నారు. నిజానికి అటు మహేష్ తో పాటు ఇటు పవన్ తో కూడా మంచి అనుబంధం కలిగి ఉన్న పూరి జగన్నాథ్ అతి త్వరలో ఈ పాత్రకు సంబంధించి వారిని కలవనున్నారని అంటున్నారు. అయితే ఆ ఇద్దరిలో ఈ పాత్రను ఎవరు చేస్తారు అనేది మాత్రం సస్పెన్స్ అని టాక్. ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియదు కానీ ఇదే గనుక నిజమైతే మాత్రం నిజంగా ఇది లైగర్ సినిమాకి మరింత బూస్ట్ ని ఇస్తుంది అని చెప్పక తప్పదు.....!!