టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా పదమూడేళ్ల తరువాత రాబోయే 2022 సంక్రాంతి పండుగకి అతి పెద్ద బాక్సాఫీస్ పోరులో పోటా పోటీగా తమ 27వ సినిమాలతో బరిలో నిలవనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ కూడా ఒక దాని తరువాత మరొకటి సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబు యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. బ్యాంకుల్లోని మోసాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగుల కలబోతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఫైనాన్సియర్ పాత్ర చేస్తున్నట్లు టాక్.

కాగా ఈ మూవీ ద్వారా తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా అనంతరం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మహేష్ సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఇవి రెండూ కూడా చర్చల దశలో ఉన్నాయి. మరోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం క్రిష్ తో ఒక పీరియాడికల్ సినిమా, అలానే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ రీమేక్ మూవీ అయ్యప్పనుం కోషియం లో కూడా నటిస్తున్నారు. అయితే వీటిలో క్రిష్ మూవీ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 

కాగా ప్రస్తుతం నటిస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలని ఎంత బాగా క్యారెక్టర్స్ పరంగా వాడుకుంటే తప్పకుండా అవుట్ ఫుట్ అంతబాగా వచ్చి అవి సక్సెస్ లు గా మారి ఎందరో దర్శకనిర్మాతల తో పాటు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరుగుతుందని, ఆ విధంగా వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అని, నిజానికి ప్రస్తుతం ఆకాశమే హద్దుగా క్రేజ్, మార్కెట్ తో కొనసాగుతున్న ఈ ఇద్దరు హీరోల సినిమాలకు పక్కాగా హిట్ టాక్ కనుక వస్తే ఆ ప్రభంజనాన్ని బాక్సాఫీస్ తట్టుకోలేదనేది తమ అభిప్రాయం అని అంటున్నారు పలువురు ప్రేక్షకులు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: