టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన
సూపర్ స్టార్ మహేష్ బాబు,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా పదమూడేళ్ల తరువాత రాబోయే 2022
సంక్రాంతి పండుగకి అతి పెద్ద బాక్సాఫీస్ పోరులో పోటా పోటీగా తమ 27వ సినిమాలతో బరిలో నిలవనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ కూడా ఒక దాని తరువాత మరొకటి సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం
మహేష్ బాబు
యువ దర్శకుడు
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట
సినిమా చేస్తున్నారు. బ్యాంకుల్లోని మోసాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగుల కలబోతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో
మహేష్ బాబు ఒక ఫైనాన్సియర్ పాత్ర చేస్తున్నట్లు టాక్.
కాగా ప్రస్తుతం నటిస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలని ఎంత బాగా క్యారెక్టర్స్ పరంగా వాడుకుంటే తప్పకుండా అవుట్ ఫుట్ అంతబాగా వచ్చి అవి
సక్సెస్ లు గా మారి ఎందరో దర్శకనిర్మాతల తో పాటు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరుగుతుందని, ఆ విధంగా వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అని, నిజానికి ప్రస్తుతం ఆకాశమే హద్దుగా క్రేజ్,
మార్కెట్ తో కొనసాగుతున్న ఈ ఇద్దరు హీరోల సినిమాలకు పక్కాగా హిట్ టాక్ కనుక వస్తే ఆ ప్రభంజనాన్ని బాక్సాఫీస్ తట్టుకోలేదనేది తమ అభిప్రాయం అని అంటున్నారు పలువురు ప్రేక్షకులు.... !!