టాప్ హీరోల కొడుకులు వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సస్ అవుతున్నారు. కానీ టాప్ దర్శకుల కొడుకులు హీరోలుగా రాణించలేకపొతున్నారు. హీరోలుగా ఎందరికో కెరియర్ కల్పించిన దర్శక రత్న దాసరి నారాయణరావు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కొడుకును కనీసం మిడిల్ రేంజ్ హీరోగా కూడ సెటిల్ చేయలేకపోయాడు. ఇప్పుడు దర్శకుడు పూరీ పరిస్థితి కూడ అలాగే ఉంది.


టాప్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన పూరీ తన కొడుకు ఆకాష్ ను ఇంకా హీరోగా సెటిల్ చేయలేకపోతున్నాడు. తన కొడుకును క్రేజీ హీరోగా నిలబెట్టాలని పూరీ జగన్నాథ్ స్వయంగా రంగంలోకి దిగి ‘ఆంధ్రాపోరి’ మూవీని తీసాడు. ఆ సినిమా సక్సస్ అవ్వకపోయినా తన సొంత బ్యానర్ పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ‘మెహబూబా’ అనే లవ్ స్టోరీని తీసాడు. 1971లో జరిగిన ఇండో పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ కూడ ఫ్లాప్ గా మారింది. అయినా నిరాశ పడకుండా తన కొడుకును మళ్ళీ హీరోగా పెట్టి పూరీ ‘రొమాంటిక్’ అనే మూవీ తీస్తున్నాడు.  


అనిల్ పదూరి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ప్రారంభం అయి చాల కాలం అవుతున్నా ఈమూవీ పూరీకి సంతృప్తికరంగా లేకపోవడంతో మళ్ళీ ఈమూవీని రీ షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి అయిన ఈమూవీ ఫైనల్ ఎడిటింగ్ ను పూరీ తానే దగ్గర ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు టాక్. ముఖ్యంగా ఈమూవీలో రొమాంటిక్ సీన్స్ లో తన కొడుకు ఆకాష్ చాల సహజంగా రెచ్చిపోయి నటించడం పూరీకి చాల ఆనందాన్ని కలిగిస్తున్నట్లు టాక్. కనీసం ఈసినిమా ద్వారా అయినా ఆకాష్ కు హిట్ ఇవ్వాలని పూరీ చాల గట్టి ప్రయత్నాలు చేస్తూ ఈ మూవీ ఎడిటింగ్ విషయంలో అదేవిధంగా రీ షూట్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: