మహేష్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కమర్షియల్ మూవీ సర్కారు వారి పాట. తమన్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న మహేష్ దీని ద్వారా మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

నిజానికి ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వలన ఆగిపోయింది. ఇటీవల దుబాయ్ లో ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ని ఎంత గ్రౌండ్ లెవెల్లో నిర్వహించారు. అనంతరం కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు సహా యూనిట్ మొత్తం ఇండియాకి తిరిగి వచ్చింది. ఇక ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ ని అమెరికాలో గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారట నిర్మాతలు. అయితే యూనిట్ లో కొందరు సభ్యులకు ఇంకా వీసాలు జారీ కాకపోవడంతో తదుపరి షెడ్యూల్ ని మరొకసారి దుబాయ్ లోనే జరుపనున్నారని చెబుతున్నారు.

నిజానికి ఈ వార్త కొద్ది రోజుల నుంచి వైరల్ అవుతున్నప్పటికీ రెండు రోజుల నుంచి పలువురు మహేష్ సన్నిహితుల నుండి అందుతున్నసమాచారం ప్రకారం ఇది నిజమేనని అంటున్నారట. మరోవైపు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మరొకసారి దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ ఇందులో ఒక ఫైనాన్షియర్ పాత్ర పోషిస్తుండగా కీర్తి సురేష్ ఒక బ్యాంకు ఉద్యోగిని పాత్రలో కనిపించనున్నట్లు టాక్. తొలిసారిగా తనకు ఇష్టమైన మహేష్ తో చేస్తున్న సినిమా కావడంతో దర్శకుడు పరశురామ్ కూడా ఈ మూవీని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. మరి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఈ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: