టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈమధ్య సినిమాలు లేకపోయినా చేతిలో మాత్రం మంచి ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవి హిట్ అయితే కనుక ఆమె మళ్ళీ పాత వైభవం రాక తప్పదు.. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ తొలి సినిమా తోనే మంచి సక్సెస్ కొట్టి మంచి ఫామ్ ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు.. అనతి కాలంలో నే స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ అయిపొయింది.. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందింది.. ప్రస్తుతం తెలుగులో ఆమెనే టాప్ హీరోయిన్..

అయితే గత కొద్దీ కాలంగా రకుల్ కి మంచి అవకాశాలు రావట్లేదు.. పూజ హెగ్డే, రష్మిక మందన్న ఎంట్రీ తో ఆమెకు ఛాన్స్ లు తగ్గిపోయాయి.. ఇటీవలే విడుదల అయిన నితిన్ చెక్ సినిమా లో కనిపించిన రకుల్ కి ఆ సినిమా ద్వారా వచ్చిన ప్లస్ ల కంటే మైనస్ లే ఎక్కువ అని చెప్పాలి.. సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్ కి ఏమంత పేరు కూడా రాలేదు. ఆమె చేతిలో వైష్ణవ్ రెండో సినిమా తప్పా ఏదీ లేదు.. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు రకుల్ మళ్ళీ కమ్ బ్యాక్ చేయాలనీ కోరుకుంటున్నారు.

ఈనేపథ్యంలో ఆమె డేట్స్‌ను శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం వాడుకోవాలని చూస్తున్నాడట. ‘ఇండియన్ 2’ ఆగిపోయిన తర్వాత శంకర్ కమిటైన చిత్రం దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కాల్సి ఉన్న చిత్రమే. ఈ చిత్రంలో రకుల్‌ని హీరోయిన్‌గా తీసుకుంటే.. కలిసొస్తుందని శంకర్ భావిస్తున్నాడట. అలాగే ‘ఇండియన్ 2’కి దిల్ రాజు కూడా కొంత పెట్టుబడి పెట్టి ఉండటంతో.. ఈ రూపంలో అయినా అవి రికవరీ అయినట్టు అవుతుందని దిల్ రాజు కూడా రకుల్ విషయంలో సానుకూలంగా స్పందించాడని అంటున్నారు. అన్నీ సెట్టయితే.. ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అయితే.. పాన్ ఇండియా రేంజ్‌లో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో రకుల్ కాకుండా.. వేరే వుడ్‌కి చెందిన హీరోయిన్ అయితే బాగుంటుందని మెగాభిమానులు దిల్ రాజుకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: