సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరుశురామ్ దర్శకత్వంలో బ్యాంకింగ్ రంగంలో ఇటీవల జరిగిన పలు కుంభకోణాలు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాపై ఆయన అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా మెయిన్ విలన్ గా ప్రముఖ కోలీవుడ్ నటుడు మాధవన్ కనిపించనున్నట్లు చెప్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభం కాగా ప్రస్తుతం కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇవాళ్టి నుంచి ఈ మూవీ షూటింగ్ ని నిలుపుదల చేసింది యూనిట్. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి, మహేష్ సినిమా ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం మిగిలి ఉండటంతో ఈలోపు మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని కమిట్ అయినట్లు ఇటీవల కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే మహేష్ మనసులో మరో ఆలోచన ఉందని రాజమౌళి సినిమా మొదలయ్యే లోపు కేవలం త్రివిక్రమ్ తో మాత్రమే కాకుండా దాని అనంతరం అనిల్ రావిపూడి తో కూడా మరో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట మహేష్ బాబు. అలానే ఈ రెండు సినిమాలపై త్వరలో అఫీషియల్ న్యూస్ బయటకు రానుందట. మరి ఈ వార్త కనుక నిజమైతే ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండుగ వార్తే అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: