టాలీవుడ్ అగ్రహీరోయిన్‌లలో పూజా హెగ్దె పేరు కచ్చితంగా ఉంటుంది. 2016 లో నాగచైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అమ్మడు ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి ఆదరణ అందుకుంది. ఆ తర్వాత ముకుంద, డీజే, అరవింద సమేత, మహర్షి సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది. అయితే గత ఏడాది వచ్చిన అలా వైకుంఠపురములో సినిమాతో అభిమానులంతా బుట్టబొమ్మ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

 వాటిలో ప్రధానంగా అక్కినేని అఖిల్ సరసన చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. అయితే అమ్మడు ఈ సినిమాలో తన పాత్ర గురించి పూజా అనేక విషయాలు చెప్పారు. ఈ సినిమాలో పూజా హెగ్దే ఓ స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారట. అయితే ఈ పాత్ర చేయడం చాలా కష్టంగా ఉందని పూజా అన్నారు. సాధారణంగా కామెడీ నటులకు ఓ పక్కా స్క్రిప్ట్ కాస్త ప్రాక్టీస్ చేసి చేస్తారని పూజా చెప్పారు.

 ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనేక మందిని మోడల్స్, హీరోయిన్‌లను ఆడిషన్ చేశారని, చివరికి తనకు ఆ పాత్ర దక్కిందని పూజా చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్దె తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,  రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో పాటు హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా తమిళ స్టార్ విజయ్ 65 లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: