సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్ ల కలయిక ఎంతో ముఖ్యం. ఒక సినిమా హిట్ కావడానికి వీరిద్దరి జోడి అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఇద్దరి జోడీ బాగుంటేనే సగం సినిమా సక్సెస్ అయినట్లు భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఆ విధంగా ద్వారా బెస్ట్ జోడీ నీ ఎంపిక చేసుకుని చాలామంది హిట్లు కొట్టారు. ఆ విధంగా తెలుగు తెరమీద క్రేజీ జంటగా మిగిలిపోతారు సదరు హీరో హీరోయిన్లు. వీరిద్దరి కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమాలు వస్తే అవి కూడా సూపర్ హిట్ చేస్తామన్నట్లు ప్రేక్షకులు వారు నటించిన సినిమాలను పదేపదే చూస్తూ ఉంటారు.

టాలీవుడ్ లో గతంలో ఎప్పుడూ చేయని హీరో హీరోయిన్ ల కాంబో లు ఇప్పుడు కుడురుతున్నాయి. ఇవి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడం తో పాటు సినిమాపై కూడా అంచనాలను పెంచుతుంది. ఆ విధంగా టాలీవుడ్ లో కుదిరిన కొత్త జోడీ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ రామ్ చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో ఆలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ చిత్రం లో కియారా అద్వానీ నటిస్తుంది. రామ్ చరణ్ శంకర్ సినిమాకు ఉత్తరాది కథానాయకుల పేర్లు వినిపిస్తున్నాయి.

చత్రపతి రీమేక్ తో హిందీలో పరిచయం కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయిక గా రెజీనా కసాండ్రా ను ఎంపిక చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా చేస్తున్న సినిమాలో కథానాయికగా పూజాహెగ్డే పేరు గట్టిగా వినిపిస్తుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో అందాల నటి కృతి శెట్టి నీ ఎంపిక చేశారట. వరుణ్ తేజ్ సినిమాలో తమన్నా ఓ పాటలో కనువిందు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎఫ్2 లో వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్న జోడిగా మాత్రం నటించలేదు. వంశీ పైడిపల్లి విజయ్ దళపతి సినిమాలో రష్మిక ను అనుకుంటున్నారు. సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: