మంచు లక్ష్మి... గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ గా, నటిగా మంచు లక్ష్మి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. మంచు మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచి లక్ష్మి... ఆ తర్వాత నటనలో తనదైన ముద్రను వేసుకుంది. నెగిటివ్ రోల్ చేసి కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది మంచు లక్ష్మి. అనగనగా ధీరుడు... అనే సినిమాతో మంచు లక్ష్మి టాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా  2011 సంవత్సరంలో రిలీజ్ కాగా ఈ సినిమాను దర్శకేంద్రుడి కుమారుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేశారు.

ఇంకా సినిమా తర్వాత మంచు లక్ష్మి టాక్ షో అనే కార్యక్రమాన్ని కూడా చేసింది. ఈ టాక్ షో తో మంచు లక్ష్మి కి మంచి పేరు వచ్చింది. అలాగే యాంకరింగ్ లో తన ప్రతిభను బయటకు తీసింది మంచు లక్ష్మి. ఇది ఇలా ఉండగా తాజాగా మంచు లక్ష్మి... సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన చేసింది. తాను కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నానని పేర్కొన్న మంచు లక్ష్మి.... యూట్యూబ్ ఛానల్ కు సంబంధించి సలహాలు కావాలంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

"నేను కొత్త యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఈ ఛానల్ కు సంబంధించి మీకు మీరు సలహాలు ఇవ్వండి. మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతాయో దయచేసి చెప్పండి. మీ అభిరుచులకు తగ్గట్టుగా నా యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేస్తాను. ఆ యూట్యూబ్ ఛానల్ లో... అందరూ మెచ్చేలా వీడియోలు పెడతాను. కాబట్టి దీనికి సంబంధించిన సలహాలు,  సూచనలు ఇవ్వండి" అంటూ మంచు లక్ష్మిపోస్టర్ ద్వారా తన అభిమానులను కోరింది. అయితే మంచు లక్ష్మీ పోస్టర్ పై రకరకాలుగా తన అభిమానులు స్పందిస్తున్నారు. మహిళలకు సంబంధించి వీడియోలు కావాలని కొందరు అంటే.. మరికొందరేమో ఫన్నీ, సమాజానికి ఉపయోగపడే వీడియోస్ కావాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: