బుల్లి తెరపై మా టీవీలో విజయవంతంగా ప్రసారమవుతున్న 'కార్తీక దీపం' సీరియల్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ అంటే ఒకరకంగా పిచ్చి అని చెప్పాలి. అందులోనూ ఇందులో ప్రధాన పాత్ర వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ , అత్తగా అర్చన, డాక్టర్ బాబు గా నిరుపమ్ , మోనిత గా శోబిత శెట్టి చాలా ఫేమస్ అయ్యారు. ప్రేక్షకులు వీరిని మోనిత, దీప, సౌందర్య గారు అంటూ ఇవే అసలు పేర్లుగా పిలుచుకుంటున్నారు. ముఖ్యంగా వంటలక్కగా దీపపై ప్రేక్షకులకు చాలా సింపతీ,  వీరు బుల్లి తెరపైనే కాకుండా వెండితెరపై కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు పలు వార్తలు వినిపించాయి.  
ఇప్పటికే దీప మరియు మోనితలు సినిమాలలో ఛాన్సులు అందుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ప్రేమి విశ్వనాథ్ (దీప) ఓ చిత్రంలో కీ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం మొదలయ్యింది. కణం సినిమా తరహాలో ఓ కథ రెడీ అవబోతుందని అందులో ప్రధాన పాత్ర కొరకు అనసూయ పేరు వినిపిస్తుండగా ఆ చిత్రంలో చిన్నారికి తల్లిగా ప్రేమి విశ్వనాథ్ చేయబోతున్నారు అంటూ టాక్. ఇందులో ఆమె పాత్ర సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.  హారర్ థ్రిల్లర్  కథాంశంతో  ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం.  అయితే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బుల్లి తెరపై ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కార్తికదీపంలో దీప క్యారెక్టర్ అంటే ఆడియన్స్ కి పిచ్చి... వంటలక్క కష్టాలు చూస్తూ ఏడ్చే అభిమానులు ఎంతమందో...ఇలా తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క దీపగా ప్రేమి విశ్వనాథ్ చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమా స్టార్స్ తో సమానంగా ఈ సీరియల్ లో నటీనటులు ఫాలోయింగ్ పెంచుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. మరి వెండి తెరపై కూడా ఇదే విధంగా సక్సెస్ పథంలో కొనసాగుతారా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: