టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు. ఇప్పటికే నితిన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'చెక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నితిన్ కు నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత వెంటనే కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్ దే' సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించిన నితిన్ కు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది.

ఇలా కరోనా సమయంలో రెండుసార్లు థియేటర్లలో తన సినిమాలను విడుదల చేసిన నితిన్, ప్రస్తుతం తాను నటించిన 'మాస్ట్రో' సినిమాను ప్రముఖ 'ఓటిటి' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా జనాల ముందుకు తీసుకోవచ్చాడు. ఈ సినిమా  హిందీ సినిమా 'అంధాదున్' కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ సెప్టెంబర్ 17 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం నితిన్ కు బెస్ట్ సినిమా అయ్యే అవకాశం ఉన్నట్లు చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే నితిన్ 'మాస్ట్రో' సినిమా గురించి మాట్లాడుతూ. ఈ సినిమాలో మొదట తమన్నా పాత్రకు నయనతార ను అనుకున్నాం, ఆమె కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది , కాకపోతే తర్వాత కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత తమన్నాను తీసుకున్నాం. తమన్నా కూడా ఈ పాత్రకు చాలా బాగా న్యాయం చేసింది. ఈ సినిమాకు తమన్నా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ను తీసుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: