మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆచార్య
సినిమా ఫిబ్రవరి 24వ తేదిన విడుదలకు సిద్ధం చేస్తున్న
చిరంజీవి తొందరలోనే
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కబోయే
గాడ్ ఫాదర్ చిత్రం ను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు. ఇక
మెహర్ రమేష్ భోళా
శంకర్ సినిమా కూడా తొందరలోనే మొదలు కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.
తొందర్లోనే ఈ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధంగా
చిరంజీవి ప్రణాళికలు రచించాడు. ఇక
బాబీ దర్శకత్వంలోని
సినిమా ను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు చిరు. ఆ విధంగా ఒకే సారి ఈ మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లి సంవత్సర కాలంలోనే ఈ చిత్రాలను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాల తర్వాత ఆయన చేయబోయే సినిమాలను కూడా అనౌన్స్ చేయాలని
చిరంజీవి భావిస్తున్నాడు.